సుశాంత్ ది హత్యే.. కుటుంబ సభ్యులు బయటపెట్టిన తొమ్మిది పేజీల లేఖ..!

-

బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. ఇటు బాలీవుడ్, అటు మహారాష్ట్ర రాజకీయాల్లో కూడా ఈ కేసు తీవ్ర దుమారం రేపుతుంది. కాగా, తాజాగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతిపై ఆయన కుటుంబ సభ్యులు ఇవాళ 9 పేజీల సుదీర్ఘ లేఖ విడుదల విడుదల చేశారు. సుశాంత్ ది హత్యేనంటూ ఈ లేఖలో వారు ఆరోపించారు. ఓ మారు మూలు గ్రామంలో ఉండే సుశాంత్ కుటుంబం పిల్లల చదువు కోసం సిటీకి రావటం దగ్గర నుంచే లెటర్‌ ప్రారంభించారు.

హిందీలో రాసిన ఈ లెటర్‌లో సుశాంత్ తల్లిదండ్రులు, అక్కచెల్లెల గురించి వారి ఎదుగుదల గురించి, వివరించారు. ఓ కుటుంబంగా తమ మధ్య దృఢమైన సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. తల్లి మరణానంతరం ఆమె లేని లోటు తెలియకుండా సుశాంత్ ను పెంచామని, ఆమె ఆశయాలకు అనుగుణంగా సుశాంత్ ను తీర్చిదిద్దామని పేర్కొన్నారు. సుశాంత్ ది బలవన్మరణం అంటూ చిత్రీకరించారని ఆవేదన వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news