రేవంత్, రెడ్డి అయినా…అండగా నిలబడాలి..స్వామి గౌడ్ సంచలనం !

-

తెలంగాణా రాజకీయాలు రంజుగా మారాయి. స్వామీ గౌండ్ లాంటి నేతకు అన్యాయం జరుగుతోందని రేవంత్ రెడ్డి అంటే, రేవంత్ రెడ్డి పుట్టింది రెడ్డి పుటకే అయినా బడుగుల కోసమే అంటున్నారు స్వామి గౌడ్. బోయినపల్లి సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణ సభలో మాజీ కౌన్సిల్ చైర్మన్ స్వామిగౌడ్ ఈ సంచలన కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి పై ప్రశంశల వర్షం కురిపించారు. రేవంత్ రెడ్డి పుట్టింది రెడ్డి సామాజిక వర్గంలో అయినా బడుగు వర్గాలకు చేతికర్రగా మారారని బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలిచే వ్యక్తులను మనం గుర్తించాలి, వారికి అండగా నిలబడాలని అన్నారు.

swamigou
swamigou

తెల్ల బట్టల వారికి మనం అమ్ముడు పోవొద్దన్న ఆయన 2500 కోట్ల వ్యక్తిని ఒక పార్టీ నిలబడితే, 3500 కోట్లు ఉన్న వ్యక్తిని మరో పార్టీ నిలబెడుతోందని అన్నారు. ఒక పార్టీ 10 మందిని చంపినోడిని నిలబడితే మరో పార్టీ 15 మందిని చంపినోడిని నిలబెట్టాలని చూస్తోందని ఆయన అన్నారు. ఇలాంటి రాజకీయాలను ప్రజలు గమనించాలి, చైతన్యం కావాలని అన్నారు. యువత రాజకీయాల్లోకి రావాలి, కొత్త రాజకీయాలకు రూపుదిద్దాలని అప్పుడే ప్రజాస్వామ్యం నిలబడుతుందని ఆయన చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news