కెసిఆర్ చరిత్రలో నిలిచిపోతారు : స్వరూపానందేంద్ర స్వామి

-

యాదాద్రి నిర్మాణంపై విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి స్పందించారు. కెసిఆర్ చరిత్రలో నిలిచిపోతారు అంటూ పొగడ్తలు కురిపించారు. తెలంగాణలో మత సామరస్యంతో కేసీఆర్‌ పాలన సాగుతోందని వ్యాఖ్యానించారు. రాజుల కాలం తర్వాత నిర్మాణమైన అద్భుతమైన దేవాలయం యాదాద్రి అంటూ స్వరూపానందేంద్ర కొనియాడారు. సనాతన ధర్మాన్ని గుర్తించి యాదాద్రిని కేసీఆర్ మహాక్షేత్రంగా తీర్చిదిద్దారు అంటూ వ్యాఖ్యానించారు.

కేసీఆర్‌ మైలురాళ్లలో తెలంగాణ సాధనతో పాటు యాదాద్రి నిర్మాణం కూడా చిరస్థాయిగా నిలుస్తుందని స్వరూపానందేంద్ర చెప్పారు. యాదాద్రిలో వేదిక్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ఇలా ఉంటాయి యాదాద్రి నిర్మాణాన్ని ప్రభుత్వం అద్భుతంగా తీర్చిదిద్దిన సంగతి తెలిసిందే. తెలంగాణ తిరుమల గా యాదాద్రి తీర్చిదిద్దుతామని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఇక ఆలయ నిర్మాణం పూర్తవడంతో కేసీఆర్ పై ప్రశంసలు కురుస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news