Bigg Boss 5 Telugu: వాడితో చాలా దూరంగా ఉండండి.. ర‌వి నిజ‌స్వ‌రూపాన్ని బ‌య‌ట‌పెట్టినా శ్వేత!

-

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ 5 తెలుగు.. బుల్లి తెర ప్రేక్ష‌కుల‌కు పుల్ మీల్స్ ఎంట‌ర్‌టైన్ అందిస్తుంది. ఇప్పటి వ‌ర‌కూ ఇంట్లో నుంచి ఆరుగురు కంటెస్టెంట్స్ బ‌య‌ట వ‌చ్చేశారు. ఇప్పటివ‌ర‌కూ సరయు, ఉమా దేవీ, లహరి, నటరాజ్ మాస్టర్, హమీదలు బయటకు వెళ్లారు.ఈ ఆరో వారం ఊహించ‌ని విధంగా .. ఎన్నో ఉత్కంఠ‌ల మ‌ధ్య శ్వేతా వర్మ బయటకు వచ్చేసింది. ఇక ఇంటి నుంచి బయటకు వచ్చిన శ్వేత వర్మ ఒక్కో కంటెస్టెంట్ గురించి తన అభిప్రాయాన్ని చెప్పేసింది.


అయితే… రొటిన్ కు భిన్నంగా.. శ్వేత తో నాగార్జున ఓ ఆట ఆడించాడు. రోడ్డు భద్రతలో భాగంగా చూపించే సిగ్నల్స్‌తో కంటెస్టెంట్లను పోల్చాలని శ్వేతా వర్మకు టాస్క్ ఇచ్చాడు. ఈ క్ర‌మంలో.. ర‌వి గురించి మాట్లాడుతూ.. సంచ‌లన వ్యాఖ్య‌లు చేసింది. ర‌వి వెరీ స్మార్ట్ అని, అత‌డికి దూరంగా ఉండాల‌ని ఇంటి స‌భ్యులను హెచ్చ‌రించింది శ్వేత‌. హౌస్‌లో మాన‌స్ డేంజ‌ర్ అని షాకింగ్ కామెంట్ చేశారు. త‌రువాత ఆనీ మాస్ట‌ర్ ని టార్గెట్ చేసింది. త‌క్కువ మాట్లాడి ఎక్కువ ఆడాల‌ని పంచ్ వేసింది. టాప్ 5లో చూడాల‌నుకుంటున్నాన‌ని ఆశిస్తున్న‌ట్టు తెలిపింది.

శ్రీరామ్‌కు త్వ‌ర‌గా రీచార్జ్ చేసుకోవాల‌ని నువ్వు కూడా టాప్ 5లో ఉండాలని కోరింది. విశ్వ గేమ్‌లో దారి తప్పుతున్నాడు కానీ టాస్కుల్లో ట‌ఫ్ కాంపిటీష‌న్ ఇస్తున్నాడ‌ని, అత‌డిని చూస్తుంటే విశ్వ ఒలంపిక్స్‌కు కూడా వెళ్లిపోవ‌చ్చ‌నిపిస్తుంద‌ని, ఫైన‌ల్ గా శ్రీ రామ్ .. శ్వేత కోసం ముస్త‌ఫా ముస్త‌ఫా పాట పాడి శ్వేతకి వీడ్కోలు చెప్పారు. మొత్తం పైనా.. రవితోనే జాగ్రత్తగా ఉండాలని కంటెస్టెంట్ల అంద‌రినికి ఇండైరెక్ట్ గా చెప్పింది. అంతకుముందు లహరి ఎలిమినేషన్.. ఇప్పుడు శ్వేత విషయంలో కూడా అదే జరిగిందని చెప్తున్నారు నెటిజన్స్.

Read more RELATED
Recommended to you

Latest news