T20 world cup final : రేపే తుది పోరు…. టీమిండియా కీలక నిర్ణయం

-

టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో సౌతాఫ్రికాతో టీమిండియా రేపు తాడోపేడో తేల్చుకోనుంది.ఫైనల్ కు ముందు భారత జట్టు కీలక నిర్ణయం తీసుకుంది.ప్రీ మ్యాచ్ ట్రైనింగ్ సెషన్‌ను ఇండియా రద్దు చేసింది. మరోవైపు, దక్షిణాఫ్రికా ట్రైనింగ్ సెషన్‌లో పాల్గొననున్నది.కీలక మ్యాచ్‌కు ముందు ఆటగాళ్లకు విశ్రాంతిని ఇవ్వాలనే ఉద్దేశంతోనే టీమ్ ఇండియా ప్రాక్టీస్‌ను రద్దు చేసుకున్నట్టు సమాచారం.గ్రూపు దశ మ్యాచ్‌ల తర్వాత ఇండియా షెడ్యూల్ బిజీగా బిజీగా ఉంది. 8 రోజుల వ్యవధిలోనే 4 మ్యాచ్‌లు ఆడింది. సూపర్-8 లో ఈ నెల 20న అఫ్గానిస్తాన్, 22న బంగ్లాదేశ్, 24న ఆస్ట్రేలియాతో తలపడింది. ఇక ఈ మ్యాచ్ లకు ఒక్క రోజు గ్యాప్ మాత్రమే ఉంది. ఆసిస్ తో మ్యాచ్ తర్వాత సెమీస్‌లో ఇంగ్లాండ్‌తో పోరుకు కూడా 2 రోజుల గ్యాప్ మాత్రమే ఉంది.

ఇప్పుడు సెమీస్‌కు ఫైనల్‌కు మధ్య ఒక్క రోజు మాత్రమే ఉండడంతో ఆటగాళ్లకు సరైన విశ్రాంతి లభించలేదు. ఫైనల్‌కు ముందు ప్రశాంతంగా మైదానంలోకి అడుగుపెట్టాలని ఇండియా భావిస్తున్నది. అందుకే, ట్రైనింగ్ సెషన్‌ను రద్దు చేసుకున్నట్టు సమాచారం. సెమీస్ అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ‘జట్టుగా మేం ప్రశాంతతో ఉండాలి. ఫైనల్ అనేది మాకు ఎంతో కీలకం. ప్రశాంతతతో ఉంటేనే మంచి నిర్ణయాలు తీసుకోగలం.’ అని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news