తహసీల్దార్‌ సుజాత భర్త ఆత్మహత్య..!

-

హైదరాబాదులోని బంజారాహిల్స్ భూవివాదంలో లంచం తీసుకున్న కేసులో ఇరుక్కున్న సజాతను తెలంగాణ ఏసీబి అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆమె భర్త అజయ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. అజయ్‌ కుమార్‌ బుధవారం చిక్కడపల్లిలోని తన సోదరి నివాసానికి వచ్చారు. అనంతరం ఐదు అంతస్థుల భవనం పైనుంచి దూకి బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు. అజయ్‌కుమార్‌ మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలపై అన్వేషిస్తున్నారు. అయితే బార్య అవినీతి కేసులో అజయ్‌ ను కూడా గతంలో ఏసీబీ విచారణ చేసింది. భార్య ఏసీబీకి పట్టుబడటంతో తీవ్ర మనస్తాపానికి గురైన అజయ్‌ ఈ ఘటనకు పాల్పడినట్లు సమాచారం​.

Read more RELATED
Recommended to you

Latest news