ఒత్తిళ్లకు గురికాకుండా పరీక్ష రాయండి: సీఎం రేవంత్ రెడ్డి

-

గ్రూప్-1 ప్రిలిమినరీ ఎగ్జామ్ రాసే అభ్యర్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు హాజరుకావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారని తెలంగాణ CMO ట్వీట్ చేసింది. ఎలాంటి ఒత్తిళ్లకు గురికాకుండా పరీక్ష రాయాలని తెలిపారని, అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలియజేశారని పేర్కొంది. కాగా ఉదయం 10 గంటలలోగా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని టీజీ పీఎస్సీ సూచించింది. రేపు జరిగే పరీక్ష కోసం 4.03 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.ఓఎంఆర్ విధానంలో రాత పరీక్ష నిర్వహించనున్నారు.

అయితే హాల్ టికెట్‌పై లేటెస్ట్ పాస్ ఫొటో తప్పనిసరిగా అతించుకోని వెళ్లాలి. అంటే 3 నెలల క్రితం నుంచి నేటి వరకు దిగిన పాస్ ఫొటో తప్పనిసరి. హాల్ టికెట్‌పై అభ్యర్థి తన ఫొటో పేస్ట్ చేయకపోతే ఎగ్జామ్ సెంటర్‌లోకి అనుమతించరు అని స్పష్టం చేసింది. ఈ నిబంధనను హాల్ టికెట్‌లో పొందుపరిచినట్లు టీఎస్‌పీఎస్సీ అధికారులు తెలిపారు. ఫొటో కింద సంతకం చేసేందుకు తప్పనిసరిగా స్పేస్ ఉంచుకోవాలని ,హాల్ టికెట్‌తో పాటు పాస్ పోర్ట్, ఓటర్ ఐడీ, ఆధార్ కార్డు,పాన్ కార్డు, గవర్నమెంట్ ఎంప్లాయ్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ వంటి ఒరిజినల్ కార్డును పరీక్షా కేంద్రం వద్ద చూపిస్తేనే లోపలికి అనుమతిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news