తొలిసారిగా హైకింగ్ యాత్రను నిర్వహించిన తామా

-

తొలిసారిగా మెట్రో అట్లాంటా తెలుగు సంఘం(తామా) పర్వతారోహణ(హైకింగ్) యాత్ర ను నిర్వహించినట్లు తెలుస్తుంది. తెలుగు సంస్కృతి తెలుగు స్రవంతి స్లోగన్ తో ఉండే తామా అట్లాంటా వారు తొలిసారిగా ఈ హైకింగ్ యాత్రను నిర్వహించారు. ప్రతి ఒక్కరిలో ఆరోగ్యం,శారీరక శ్రమ మరియు వ్యాయామం పై అవగాహన కల్పించాలన్న ఉద్దేశ్యం తో ఈ హైకింగ్ యాత్ర చేపట్టినట్లు తెలుస్తుంది. ఈ హైకింగ్ యాత్రలో భాగంగా జార్జియా లోని సానీ పర్వతం వద్ద ఉదయం 7:30 గంటలకు ప్రారంభమైన ఈ యాత్ర సాయంత్రం వరకు కొనసాగింది. అయితే ఈ పర్వతారోహణ యాత్ర మొత్తం ఆద్యంతం ఉత్సాహంగా సాయంకాలం వరకు సాగినట్లు తామా సభ్యులు తెలిపారు. ఈ యాత్రలో ప్రవాసులు తమ స్నేహితులు,కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నట్లు తెలుస్తుంది. వారంతా కూడా దాదాపు మొత్తం 3 మైళ్ల దూరాన్ని అధిరోహించినట్లు వారు తెలిపారు. ఈ హైకింగ్ కార్యక్రమంలో తామా అధ్యక్షుడు భరత్ మద్దినేని,క్రీడల కార్యదర్శి రమేష్ వెన్నెలకంటి, భరత్ అవిర్నేని,హితేష్ వడ్లమూడి,రూపేంద్ర వేములపల్లి,శుశ్రత్ రెడ్డి బుసిరెడ్డి, రాజశేఖర్ చుండురి, శ్రీనివాస్ ఉప్పు,శివదేవ భక్తుని, నాగేష్ దొడ్డాక, అలానే వాలంటీర్లు రాజేష్ జంపాల,అంజయ్య చౌదరి లావు,హేమంత్ వర్మ పెన్మెట్స, మురళి బొడ్డు, అనురాగ్ బండ్ల, ఉపేంద్ర నర్రా, వినయ్ మద్దినేని, నరేంద్ర సూరపనేని, మోనిష్ జంపాల,తనీష్ జంపాల తదితరులు పాల్గొన్నట్లు తెలుస్తుంది.

తామా ఆధ్వర్యంలో అక్కడి ప్రవాస భారతీయుల కోసం పలు ఈవెంట్స్ ను నిర్వహిస్తూ ఉంటుంది. ఈ ఈవెంట్స్ లో భాగంగానే ఈ హైకింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహంగా సాగినట్లు నిర్వాహకులు తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Latest news