ఘోర రోడ్డు ప్రమాదం, 22 మంది మృతి…!

-

తమిళనాడు రాష్ట్రం లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం తెల్లవారుజామున కోయంబత్తూర్ దగ్గరలోని తిర్పూర్ సమీపంలోని అవినాషీ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. తెల్లవారు జామున ఒక కంటైనర్ ప్రైవేట్ బస్సు డీ కొనడంతో ఈ ప్రమాదంలో 22 మంది అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో ఆరుగురు మహిళలు ప్రాణాలు కోల్పోగా 33 మంది వరకు తీవ్రంగా గాయపడినట్టు సమాచారం.

వేగంగా వస్తున్న ప్రైవేట్ బస్సు ఈ ప్రమాదానికి కారణమని అధికారులు భావిస్తున్నారు. దీనితో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జం అయింది. బాధితులను సమీప ఆస్పత్రులలోకి తరలించగా మృతులను తిర్పూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే పొగ మంచు ఎక్కువగా ఉన్న నేపధ్యంలోనే ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు భావిస్తున్నారు. కొంత మృతదేహాలు చిద్రమైనట్టు తెలుస్తుంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news