చెన్నై సౌత్ నుంచి తమిళి సై ఎంపీగా పోటీ..!

-

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో తమిళనాడులో బీజేపీ మూడో జాబితాను తాజాగా విడుదల చేసింది బీజేపీ అధిష్టానం. ఇందులో తమిళనాడు నుంచి 9 మంది అభ్యర్థులు బరిలో ఉండనున్నారు. చెన్నై సౌత్ నుంచి తెలంగాణ మాజీ గవర్నర్ తమిళి సై పోటీ చేయనున్నారు. కోయంబత్తూరు నుంచి తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై బరిలో నిలిచారు.

నీలగిరి నుంచి మురుగన్, కన్యాకుమారి నుంచి రాధాకృష్ణన్ పోటీ చేయబోతున్నారు. కాగా, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ లోక్సభ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులను క్రమంగా ప్రకటిస్తోంది. మొదటి జాబితాలో 195 మందితో విడుదల చేయగా.. రెండో జాబితాలో మరో 72 మందిని అనౌన్స్ చేసింది. ఇక తాజాగా మూడో జాబితాలో 9 మందిని ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news