ఎమ్మెల్సీగా కౌశిక్ రెడ్డి : గవర్నర్ ఆమోదముద్ర

-

గవర్నర్ కోటా ఎమ్మెల్సీ కి తెలంగాణ గవర్నర్ తమిళి సై ఆమోద ముద్ర వేశారు. దీంతో తెలంగాణ గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా కౌశిక్ రెడ్డి నియామకం అయ్యారు. తెలంగాణ కేబినెట్ సిఫారసుకు ఇవాళ గవర్నర్ తమిళి సై ఆమోద ముద్ర వేశారు. కాగా.. ప్రగతి భవన్ లో నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే.

తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర‌రాజ‌న్

అయితే ఈ సందర్భంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి టిఆర్ఎస్ పార్టీలో చేరిన పాడి కౌశిక్ రెడ్డి కి… బంపర్ ఆఫర్ ఇచ్చారు. గవర్నర్ కోటాలో పాడి కౌశిక్ రెడ్డి కి… ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని… తెలంగాణ గవర్నర్ తమిళ సై కి సిఫారసు చేశారు సీఎం కేసీఆర్. ఈ నేపథ్యంలోనే ఇవాళ గవర్నర్ కోటా ఎమ్మెల్సీ కి తెలంగాణ గవర్నర్ తమిళి సై ఆమోద ముద్ర వేశారు. ఇక గవర్నర్ నిర్ణయంతో కౌశిక్ రెడ్డి శిబిరంలో ఆనందం నెలకొంది.

Read more RELATED
Recommended to you

Latest news