సెమీస్‌లో ఓడిపోవడంతో భావోద్వేగానికి గురయ్యా: లైవ్‌లో సింధు

-

టోక్యో: ఒలింపిక్స్‌లో పీవీ సింధు కాంస్యం గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె భారత్ మీడియాతో లైవ్‌లో మాట్లాడారు. ఒలింపిక్స్ కోసం చాలా కష్టపడ్డానని సింధు చెప్పారు. క్యాంసం రావడం సంతోషంగా ఉందన్నారు. తన కోసం కోచ్ పార్క్ ఎంతో కష్టపడ్డారని తెలిపారు. డిఫెన్స్ మెరుగుపర్చుకున్నానని.. అందుకే పతకం సాధ్యమైందని ఆమె పేర్కొన్నారు.

హైదరాబాద్ గచ్చిబౌలి ప్రాక్టీస్ ఎంతో మెరుగుపడిందని సింధు చెప్పారు. దేశానికి పతకం తీసుకురావడం గర్వంగా ఉందన్నారు. కరోనా సమయంలో తన బలహీనతలపై పెట్టి నట్లు తెలిపారు. సెమీస్‌లో ఓడిపోవడం చాలా బాధ అనిపించదన్నారు. ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యానని సింధు పేర్కొన్నారు. కాంస్యం అవకాశం ఉందని సర్ది చెప్పుకున్నట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news