టీమిండియా మహిళా ప్లేయర్‌కి ఘోర అనుభవం.. పర్స్ కొట్టేసిన దొంగ!

-

టీమిండియా వికెట్ కీపర్ తానియా భాటియా కు చేదు అనుభవం ఎదురయింది. ఆమె గదిలోకి ప్రవేశించిన ఓ అగంతకుడు బ్యాగును ఎత్తుకెళ్లాడు. అందులో డబ్బులతో పాటు కార్డులు, విలువైన వాచీలు, వస్తువులు ఉన్నాయి. మూడు వన్డేల సిరీస్ కోసం ఇంగ్లాండు పర్యటనకు వెళ్లిన భారత జట్టు అద్భుత ప్రదర్శనతో క్లీన్ స్వీప్ చేసింది. లెజెండరీ ప్లేయర్ జులాన్ గోస్వామికి ఘన వీడ్కోలు పలికింది.

అయితే ఈ భారత పర్యటనకు వచ్చిన వికెట్ కీపర్ లేని సమయంలో ఆమె గదిలోకి దూరిన ఓ దుండగుడు బ్యాగును దొంగిలించాడు. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకుంది. ఈసీబీ, హోటల్ సిబ్బంది నిర్లక్ష్యంపై మండిపడింది. ‘లండన్ మైదా వాలే మారియట్ హోటల్ మేనేజ్మెంట్ తీరు నన్ను షాకుకు గురిచేసింది. నేను భారత క్రికెట్ జట్టుతో ఉండగా గుర్తుతెలియని వ్యక్తి నా రూమ్ లోకి దూరి బ్యాగు దొంగలించారు. ఇందులో డబ్బు, కార్డులు, వాచీలు, జువెలరీ కూడా ఉన్నాయి. ఇక్కడ ఏమాత్రం సురక్షితంగా లేదు’ అంటూ వరుస ట్వీట్లు చేసింది తానియా భాటియా.

Read more RELATED
Recommended to you

Latest news