తెలంగాణ మైనార్టీస్ కమిషన్ చైర్మన్ గా తారిఖ్ అన్సారీ

-

తెలంగాణ సీఎం కేసీఆర్‌ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర మైనారిటీస్ కమిషన్ ఛైర్మన్ గా శ్రీ తారిఖ్ అన్సారీ ని సీఎం శ్రీ కె. చంద్రశేఖర్ రావు నియమించారు. సీఎం నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అందుకు సంబంధించిన నియామక పత్రాన్ని ఈరోజు ప్రగతి భవన్ లో సీఎం చేతుల మీదుగా తారిఖ్ అన్సారీ అందుకున్నారు.

ఇక అటు హైద్రాబాద్ కాచిగూడలో గల ‘కర్నాటక సాహిత్య మందిర’ పునర్నిర్మాణం కోసం రూ. 5 కోట్లను సిఎం కేసీఆర్ మంజూరు చేశారు. ఈ దిశగా చర్యలు చేపట్టాలని స్థానిక ఎమ్మెల్యేను అధికారులను సిఎం కేసీఆర్ ఆదేశించారు. సాహిత్య, సాంస్కృతక కార్యక్రమాలతో పాటు కమ్యునిటీ అవసరాల కోసం వినియోగించుకునే విధంగా మౌలిక వసతులను ఏర్పాటు చేసి ఆడిటోరియాన్ని తీర్చిదిద్దాలని ఎమ్మెల్యేకు సిఎం సూచించారు. కాగా తమ విజ్జప్తి మేరకు రూ. 5 కోట్లను మంజూరు చేసినందుకు సిఎం కేసీఆర్ కు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, శుక్రవారం నాడు ప్రగతి భవన్ లో కలిసి కృతజ్జతలు తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Latest news