టీడీపీలో విషాదం..కీలక నేత మృతి

-

ఏపీ టీడీపీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా చిత్తూరు మాజీ ఎమ్మెల్యే డీకే సత్యప్రభ కన్ను మూశారు. అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఆమె బెంగళూరు వైదేహి ఆస్పత్రిలో మృతి చెందినట్లు సమాచారం. తొలుత కరోనా బారిన పడిన ఆమె కోలుకున్నారు. అయితే ఆమె మళ్లీ అనారోగ్యానికి గురవడంతో ఆమెను బెంగళూరు వైదేహి ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. అయితే ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఈ రోజు తెల్లవారుజామున కన్నుమూసినట్లు సమాచారం అందుతోంది.

ఈమె మాజీ ఎంపీ తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ డీకే ఆదికేశవులు సతీమణి. ఆయన 2004లో టీడీపీ తరపున చిత్తూరు ఎంపీగా గెలిచారు. టీటీడీ ఛైర్మన్‌గా రెండుసార్లు పనిచేశారు. 2009లో ఆదికేశవులు అనారోగ్యంతో మరణించాక అప్పటిదాకా బయటకు రాని సత్యప్రభ రాజకీయాల్లోకి వచ్చారు. 2014లో టీడీపీ తరపున చిత్తూరు ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం 2019 సాధారణ ఎన్నికల్లో రాజంపేట టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news