మరో 2 రోజుల్లో మిగిలిన అభ్యర్థులను ప్రకటించనున్న టీడీపీ

-

మరో రెండు నెలలు ఆంధ్రప్రదేశ్లో లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.ఈ నేపథ్యంలో వివిధ పార్టీలు ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే అధికార వైసీపీ పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే తొలి జాబితాలో భాగంగా టీడీపీ-జనసేన- బీజేపీ కూడా ఉమ్మడి అభ్యర్థులను ప్రకటించాయి.

పొత్తులో భాగంగా టీడీపీ 144 అసెంబ్లీ స్థానాలు, 16 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తోంది. ఇప్పటివరకు రెండు జాబితాల్లో కలిపి 128 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను చంద్రబాబు నాయుడు ప్రకటించారు.ఇక రెండు రోజుల్లో మిగిలిన ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించాలని టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తున్నారు. మిగిలిన 16 ఎమ్మెల్యే, 14 ఎంపీ స్థానాలకు రెండు రోజుల్లో అభ్యర్థులను ప్రకటించనున్నట్లు సమాచారం.కాగా, జనసేన పార్టీ రెండు పార్లమెంట్, 21 అసెంబ్లీ స్థానాల్లో బరిలో దిగనుంది. బీజేపీ 6 పార్లమెంట్ ,పది అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version