సీఎం రేవంత్ రెడ్డి పై ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ సెన్షేషన్ కామెంట్స్..!

-

కొన్ని  పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీలో చేరినట్టు మాజీ ఐపీఎస్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ వాదం, బహుజన వాదం ఒక్కటేనని అన్నారు. కేసీఆర్ పాలనలో స్వర్ణయుగంగా తెలంగాణకు పునాది పడిందని తెలిపారు. బీఆర్ఎస్ అధికారంలో లేకపోయినా కేసీఆర్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని పేర్కొన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి తనకు టీఎస్ పీఎస్సీ పదవిని ఆఫర్ చేశారని, కానీ తాను దానిని సున్నితంగా తిరస్కరించినట్లు వెల్లడించారు. అనంతరం ఇటీవల ఓ ప్రెస్మీట్ లో రేవంత్రెడ్డి తనను అలా తన మీద అక్కసుతోనే పొగుడుతూనే.. హెచ్చరించారని ఆరోపించారు. అయన మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. ప్యాకేజీ తీసుకునే వాడినైతే అధికార పార్టీలోనే తాను చేరేవాడినని తెలిపారు. గేట్లు తెరిస్తే వచ్చే గొర్రెల మందలో తాను ఎలా ఉంటానని అన్నారు. కేసీఆర్ కల్పించిన వేదిక ద్వారా లక్ష్య సాధనకు ప్రయత్నిస్తానని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version