దిల్లీలో దారుణం.. విద్యార్థినిని మొదటి అంతస్తు నుంచి విసిరేసిన టీచర్‌

-

దేశ రాజధాని దిల్లీలో దారుణం చోటు చేసుకుంది. చదువు చెప్పాల్సిన టీచరే.. ఓ విద్యార్థినిని మొదటి అంతస్తు కిటికీ నుంచి కిందికి విసిరేసింది. తీవ్ర గాయాలపాలైన బాలికను స్థానికులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థిని ఆరోగ్యం ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం.

సెంట్రల్‌ దిల్లీ పాఠశాలలో బాధిత విద్యార్థిని ఐదో తరగతి చదువుతోంది. ఏమైందో తెలియదుగానీ, కిటికీ లోంచి ఆమెను విసిరేయడానికి ముందు విద్యార్థినిపై టీచర్‌ కత్తెర్లతో దాడి చేసింది. గమనించిన సహచర ఉపాధ్యాయిని ఒకరు ఆమెను వారించే ప్రయత్నం చేసింది. అయినా వినకుండా కోపంతో విద్యార్థినిని కిటికీలోంచి బయటకు విసిరేసింది. దీంతో పెద్ద ఎత్తున జనం గుమిగూడి పోలీసులకు సమాచారం అందించారు. పాఠశాలకు వచ్చిన పోలీసులు నిందితురాలిని కస్టడీలోకి తీసుకొని హత్యాయత్నం కేసు నమోదు చేశారు.

తరచూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటుండంతో తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలకు పంపించాలంటే భయపడుతున్నారు. కొందరేమో కీచకులుగా మారి విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తుంటే మరికొందరు ఇలా అరాచకాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news