విండీస్ పై విక్టరీ…. టీమిండియా ప్రపంచ రికార్డు

-

టీమిండియా వన్డే సిరీస్‌ ను కైవసం చేసుకుంది. వెస్టిండీస్‌ తో జరిగిన రెండో వన్డే లోనూ టీమిండియా విక్టరీ సాధించింది. చివర్లో ఆల్‌ రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ దంచికొట్టడంతో టీ మిండియా.. ఈ మ్యాచ్‌ లో 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అంతేకాక.. మూడు వన్డేల ఈ సిరీస్‌ ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది.

312 పరుగుల భారీ ఛేదనలో శుభ్మన్‌ గిల్‌ 43 పరుగులు, శ్రేయస్‌ అయ్యర్‌ 63 పరుగులు సంజూ శాంసన్‌ 33 పరుగులు చేసారు. అయితే.. ఆఖరి పది ఓవర్లలో జట్టు విజయానికి 100 పరుగులు అవసరమైన వేళ అక్షర్‌ రెచ్చిపోయి ఆడి, టీమిండియాకు విజయం అందించారు.

ఇది ఇలా ఉండగా.. ఈ సిరీస్‌ గెలవడంతో టీమిండియా చరిత్ర సృష్టించింది. ఒకే జట్టుపై వరుసగా అత్యధదిక ద్వైపాక్షిక వన్డే సిరీస్‌ విజయాలు సాధించిన జట్టుగా నిలిచింది. ఇప్పటి వరకు విండీస్‌ పై వరుసగా టీమిండియా 12 వన్డే సిరీస్‌ ల్లో గెలిచి.. ఈ ఘటన సాధించింది.

Read more RELATED
Recommended to you

Latest news