మొద‌టి వికెట్ కొల్పోయిన టీమిండియా

-

ఆఫ్ఘ‌నిస్థాన్ తో టీ 20 ప్ర‌పంచ క‌ప్ లో భాగంగా టీమిండియా అడుతున్న విష‌యం తెలిసిందే. మొద‌ట బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా భారీ స్కోర్ దిశ గా అడుగులు వెస్తున్న స‌మ‌యంలో ప్ర‌ధాన వికెట్ అయిన రోహిత్ శ‌ర్మ అవుట్ అయ్యాడు. క‌రీమ్ జ‌న‌త్ బౌలింగ్ లో షాట్ ఆడిన రోహిత్ శ‌ర్మ ఆఫ్ఘ‌న్ కెప్టెన్ మ‌హ్మ‌ద్ న‌బీ కి దొరికిపొయాడు. దీంతో 74 ప‌రుగుల వ‌ద్ద రోహిత్ శ‌ర్మ అవుట్ అయ్యాడు.

అయితే రోహిత్ అవుట్ అయ్యే స‌మ‌యానికి టీమిండియా 140 ప‌రుగుల‌ను కేవ‌లం 14.4 ఓవ‌ర్ ల‌లో చేశారు. రోహిత్ తో పాటు మ‌రొక ఓపెన‌ర్ కెఎల్ రాహుల్ కూడా దాటి గా ఆడుతున్నాడు. రాహుల్ ప్ర‌స్తుతం 67 ప‌రుగుల వ‌ద్ద స్థిరంగా కొన‌సాగుతున్నాడు. అయితే రోహిత్ శ‌ర్మ అవుట్ అయిన త‌ర్వాత కెప్టెన్ కోహ్లి కి బ‌దులు వికెట్ కీప‌ర్ రిష‌బ్ పంత్ బ్యాటింగ్ కు వ‌చ్చాడు. అయితే రిష‌బ్ పంత్ కూడా దాటి గా ఆడే అవ‌కాశాలు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news