ఎల్లుండి బీజేపీలో చేరనున్న తీన్మార్ మల్లన్న !

-

క్యూ న్యూస్ అధినేత, ప్రముఖ జర్నలిస్టు తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్… భారతీయ జనతా పార్టీలో చేరనున్నారు. గతంలోనే ఈ విషయాన్ని ప్రకటించినప్పటికీ.. దానిపై క్లారిటీ రాలేదు. అయితే తాజాగా… స్వయంగా తీన్మార్ మల్లన్న బిజెపిలో చేరనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

డిసెంబర్ 7వ తేదీన అంటే ఎల్లుండి… భారతీయ జనతా పార్టీలో చేరనున్నట్లు తీన్మార్ మల్లన్న తన ట్విట్టర్ ఖాతా వేదికగా ప్రకటించారు. మోడీ సిద్ధాంతాలకు తాను ఆకర్షితునుడైనట్లు… ఈ నేపథ్యంలోనే బిజెపిలో చేరుతున్నట్లు స్పష్టం చేశారు తీన్మార్ మల్లన్న. బిజెపిలో చేరేందుకు అన్ని అన్ని ఫార్మాలిటీస్ పూర్తి అయ్యాయని… డిసెంబర్ 7వ తేదీన భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నట్లు ట్వీట్ చేశారు తీన్మార్ మల్లన్న. కాగా ఇటీవలే జైల్ నుంచి బెయిల్ పై తీన్మార్ మల్లన్న విడుదలయ్యారు.  ఓ స్వామిజీని, అలాగే.. తెలంగాణ ప్రభుత్వం పై చేసిన ఆరోపణల నేపథ్యంలో…  తీన్మార్ మల్లన్న ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news