Telangana: కాంగ్రెస్‌ ప్రభుత్వం పనితక్కువ.. ప్రచారం ఎక్కువ: బాల్క సుమన్‌

-

వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పెద్దపల్లి నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగురవేస్తామని ఎమ్మెల్యే బాల్క సుమన్‌ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల కసరత్తులకు సంబంధించిన విషయాల గురించి పెద్దపల్లి నియోజకవర్గ నాయకులతో ఈరోజు సమావేశం జరిగింది.నేతల సూచనలు, అభిప్రాయాలను పెద్దలు స్వీకరించారని బాల్క సుమన్ తెలిపారు. సమష్టి కృషితో పనిచేయాలని, లోక్ సభ ఎన్నికల్లో గెలుపుపై పార్టీ పెద్దలు దిశానిర్దేశం చేశారని ఆయన తెలిపారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం పని తక్కువ.. ప్రచారం ఎక్కువ అన్నట్టు ఉందని బాల్క సుమన్‌ ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ కార్యకర్తలపై కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఎందుకు దాడులకు దిగుతున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీ నేతలు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆయన అన్నారు. రైతుబంధు కింద విడుదల చేసిన డబ్బులు ఎక్కడికి పోయాయని బాల్క సుమన్ ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ప్రజాపాలన పేరుతో హామీల అమలును కాంగ్రెస్ ప్రభుత్వం వాయిదా వేసే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. ప్రజాపాలన పేరుతో దరిద్రపు పాలన చేస్తున్నారని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news