Bollywood : ఓటీటీలోకి రాబోతున్న సల్మాన్‌ ఖాన్ ‘టైగర్ 3′.!

-

మనీష్ శర్మ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన తాజా చిత్రం టైగర్ 3. ఈ చిత్రాన్ని గత ఏడాది నవంబర్ 12న దీపావళి కానుకగా విడుదల చేశారు. సల్మాన్ ఖాన్ నటించిన టైగర్ సిరీస్ కి సంబంధించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి ఆదరణను పొందిన విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఇక ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ వంటి భారీ డిజాస్టార్ తర్వాత వచ్చిన ఈ చిత్రం గ్లోబల్‌గా, దేశీయంగా మంచి వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద రూ.460 కోట్ల‌కు పైగా కలెక్షన్స్ రాబట్టింది. థియేటర్లో అలరించిన ఈ మూవీ త్వరలోనే ఓటీటీ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ప్ర‌ముఖ ఓటీటీ దిగ్గ‌జం అమెజాన్ ప్రైమ్ వీడియో వేదిక‌గా త్వ‌ర‌లోనే ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్న‌ట్లు ప్రైమ్ సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్రకటించింది. మొద‌ట ఈ సినిమాను జ‌న‌వ‌రి 07న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు వస్తున్న వార్త‌లను అబ‌ద్దం అంటూ ప్రైమ్ వెల్ల‌డించింది. ఈ సినిమాలో బాలీవుడ్ ముద్దుగుమ్మ కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటించింది. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఈ చిత్రంలో కీలకపాత్ర పోషించాడు.

Read more RELATED
Recommended to you

Latest news