కరోనా విలయ తాండవం.. తెలంగాణలో మళ్లీ భారీగా కేసులు..

-

యావత్తు ప్రపంచ దేశాలను గడగడలాడుస్తో్న్న కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు రోజు రోజుకూ పెరుగుతూ వస్తున్నాయి. అయితే తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా 562 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసులను కలుపుకుంటే రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య మొత్తం 8,07,134కు చేరుకుంది. కరోనా నుంచి కోలుకోవడంతో 616 మంది వివిధ ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు.

TS Corona: తెలంగాణలో కరోనా హెల్త్‌ బులిటెన్‌ విడుదల.. తాజాగా ఎన్ని  పాజిటివ్‌ కేసులంటే.. | Corona Health Bulletin.. New Covid 19 cases in  Telangana | TV9 Telugu

రాష్ట్రంలో కరోనా యాక్టివ్‌ కేసుల సంఖ్య 5112 కు చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా 27, 249మందికి కరోనా టెస్టులు చేశారు. తాజా కేసుల్లో 329 కేసులు ఒక్క హైదరాబాద్‌లోనే నమోదు కాగా… మేడ్చల్‌ మల్కాజిగిరిలో 52, రంగారెడ్డిలో 60, ఖమ్మంతో 14, సంగారెడ్డిలో 13 అత్యధిక కేసులు నమోదయ్యాయి.

 

 

Read more RELATED
Recommended to you

Latest news