తెలంగాణా కరోనా అప్డేట్.. 2,381 కేసులు, 10 మరణాలు !

-

తెలంగాణాలో కాస్త తగ్గినట్టుగా కనిపిస్తున్నా కరోనా కేసులు భారీ గానే నమోదవుతున్నాయి. ఏ ఒక్క రోజూ 2 వేలకు తక్కువగా కరోనా కేసులు నమోదు కావడం లేదు. తాజాగా వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం నిన్న 2,381 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,81,627 కేసులు నమోదు అయ్యాయి. ఇక నిన్న కరోనాతో 10 మంది మరణించారు. ఇప్పటి వరకు 1080 మంది కరోనాతో మరణించారు. ఇక తెలంగాణా రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 30,387గా ఉన్నాయి.


ఇక ఇప్పటి వరకు తెలంగాణాలో 1,50,160 మంది కరోనా బారిన పడి కోలుకున్నారు. తెలంగాణాలో రికవరీ రేటు 82.67% శాతంగా ఉంది. ఇండియా రికవరీ రేటు 81.71% శాతంగా ఉంది. తెలంగాణాలో మరణాలు 0.59 %గా ఉన్నాయి. రాష్ట్రంలో నిన్న 57,621 పరీక్షలు చేస్తే ఇప్పటి వరకు 27,41,836 పరీక్షలు చేసారు. నిన్న ఒక్క రోజే 2,021 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక ఎప్పటి లాగానే జీహెచ్ఎంసీ పరిధిలో భారీగా అంటే 386 కేసులు నమోదయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news