తెలంగాణాలో మళ్ళీ తగ్గిన కరోనా కేసులు

-

తెలంగాణాలో కాస్త తగ్గినట్టుగా కనిపిస్తున్న కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. అయితే ఈరోజు మాత్రం నిన్నటి మీద కరోనా కేసులు తక్కువే నమోదయ్యాయి. తాజాగా వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం నిన్న 1,896 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,06,644 కేసులు నమోదు అయ్యాయి. ఇక నిన్న కరోనాతో 12 మంది మరణించారు. ఇప్పటి వరకు 1201 మంది కరోనాతో మరణించారు. ఇక తెలంగాణా రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 26,368 గా ఉన్నాయి.


ఇక ఇప్పటి వరకు తెలంగాణాలో 1,79,075 మంది కరోనా బారిన పడి కోలుకున్నారు. నిన్న ఒక్క రోజే 2,067 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తెలంగాణాలో రికవరీ రేటు 86.65 % శాతంగా ఉంది. ఇండియా రికవరీ రేటు 84.2 % శాతంగా ఉంది. తెలంగాణాలో మరణాలు 0.58 %గా ఉన్నాయి. రాష్ట్రంలో నిన్న 50,367 పరీక్షలు చేస్తే ఇప్పటి వరకు 33,96,839 పరీక్షలు చేసారు. ఇక ఎప్పటి లాగానే జీహెచ్ఎంసీ పరిధిలో భారీగా 294 కేసులు నమోదయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news