ఏపీలో ఆ జిల్లాను వదిలేసిన కరోనా…!

-

ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి తీవ్రత క్రమంగా కొన్ని జిల్లాల్లో తగ్గుముఖం పడుతుంది. తాజాగా ప్రకాశం జిల్లాలో కరోనా కేసులు అదుపులోకి వచ్చేసాయి అని అక్కడి అధికారులు ప్రకటించారు. జిల్లాలో 179 కరోనా కేసులు నమోదు అయ్యాయి. మొత్తం 53,066 చేరుకున్నాయని అధికారులు తెలిపారు. ఒంగోలు నగరంలో అత్యధికంగా 28 కేసులు నమోదు అయ్యాయని అధికారులు ప్రకటించారు.

గడిచిన 24 గంటల్లో కరోనా భారిన పడి ఒక్కరు మృతి చెందారు. జిల్లాలో ఇప్పటి వరకు కరోనా మృతులు 507 గా ఉన్నారు. నిన్న కరోనా నుండి కోలుకుని 94 మంది డిశ్చార్జ్ అయ్యారు. హోం ఐసోలేషన్ కు పంపిన వారు 28 మంది కాగా జిల్లాలో ఆస్పత్రులతో పాటు హోం ఐసోలేషన్ లలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 4611 గా ఉన్నట్టు అధికారులు ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news