తెలంగాణా కరోనా : 857 కేసులు, 4 మరణాలు

-

తెలంగాణాలో కాస్త తగ్గినట్టుగా కనిపిస్తున్న కరోనా కేసులు కొద్ది రోజులుగా మళ్ళీ పెరుగుతున్నాయి. అయితే నిన్న ఆదివారం కావడంతో టెస్ట్ లను భారీగా తగ్గించడంతో కేసులు బాగా తగ్గాయి. తాజాగా వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం 857 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,51,188 కేసులు నమోదు అయ్యాయి. ఇక నిన్న కరోనాతో నలుగురు మరణించారు. ఇప్పటి వరకు 1381 మంది కరోనాతో మరణించారు. ఇక తెలంగాణా రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 19,239గా ఉన్నాయి.

వారిలో 16,449 మంది హోం ఐసోలేషన్‌ లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక ఇప్పటి వరకు తెలంగాణాలో 2,30,568 మంది కరోనా బారిన పడి కోలుకున్నారు. నిన్న ఒక్క రోజే 1,504 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తెలంగాణాలో రికవరీ రేటు 91.79% శాతంగా ఉంది. ఇండియా రికవరీ రేటు 92.5% శాతంగా ఉంది. తెలంగాణాలో మరణాలు 0.54%గా ఉన్నాయి. రాష్ట్రంలో నిన్న 23,806 పరీక్షలు చేస్తే ఇప్పటి వరకు 46,42,276 పరీక్షలు చేసారు. ఇక ఎప్పటి లాగానే జీహెచ్ఎంసీ పరిధిలో భారీగా 250 కేసులు నమోదయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news