తెలంగాణా కరోనా..భారీగా ఉన్నా, అదే ఊరట !

-

తెలంగాణాలో కరోనా కేసులు మళ్ళీ భారీగా నమోదయ్యాయి. ఇప్పటికే లక్ష దాటేసిన ఈ కరోనా కేసులు ఇప్పుడు తర్వాత రౌండ్ ఫిగర్ వైపు పరుగులు పెడుతున్నాయి. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం గడిచిన 24 గంటలలో 2,384 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక ఈ కేసులతో తెలంగాణాలో మొత్తం 1,04,249 కేసులు నమోదయినట్టు అయింది. అలానే గడిచిన 24 గంటల్లో 1,851 మంది కరోనా నుండి కోలుకోగా ఇప్పటి దాకా 80,586 మంది కరోనా నుండి కోలుకున్నారు.

coronavirus
coronavirus

ఇక గడిచిన 24 గంటలలో 11 మంది కరోనాతో చనిపోగా ఇప్పటి దాకా 11 మంది కరోనా నుండి కోలుకున్నారు. ఇక యాక్టివ్ కేసులు 22,908 ఉండగా అందులో 16,379 మంది హోం ఐసోలేషన్ లో ఉన్నారు. అయితే కరోనా కేసులు ఇంత భారీగా నమోదవుతున్న్నా రికవరీ రేట్ 77.30 ఉండడం ఊరట కలిగించే అంశం అని చెప్పాలి. నిన్న ఒక్క రోజే 40,666 టెస్ట్ లు చేయగా, ఇప్పటిదాకా చేసిన టెస్ట్ ల సంఖ్య 9,31,839కు చేరింది.

Read more RELATED
Recommended to you

Latest news