తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్‌కు మాతృవియోగం

-

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్ కు మాతృ వియోగం క‌లిగింది. ఆనారోగ్యంతో బాధ ప‌డుతున్న సీఎస్ సోమేశ్ కుమార్ త‌ల్లి మీనాక్షి సింగ్ (85) సోమ‌వారం క‌న్నుమూశారు. మీనాక్షి సింగ్ గ‌త మూడు వారాలుగా హైద‌రాబాద్ లోని గ‌చ్చి బౌలిలో గ‌ల ఏఐజీ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య ప‌రిస్థితి విషమించ‌డంతో మీనాక్షి సింగ్ క‌న్నుమూశారు. కాగ మీనాక్షి సింగ్ అంత్య‌క్రియ‌లు.. సొంతూరు అయిన పాట్నాలో నిర్వ‌హించ‌నున్నారు.

కాగ మాతృ వియోగం క‌లిగిన సీఎస్ సోమేశ్ కుమార్ ను తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఫోన్ ద్వారా ప‌రామ‌ర్శించారు. మీనాక్షి సింగ్ మ‌ర‌ణం ప‌ట్ల సంతాపం ప్ర‌క‌టించారు. అలాగే రాష్ట్ర మంత్రి శ్రీ‌నివాస్ గౌడ్ తో పాటు ప‌లువ‌రు ఐఏఎస్ లు, అధికారులు.. స్వ‌యంగా ఏఐజీ ఆస్ప‌త్రికి వెళ్లి.. సీఎస్ సోమేశ్ కుమార్ ను ప‌రామ‌ర్శించారు. అలాగే ప‌లువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు.. సీఎస్ సోమేశ్ కుమార్ ను ప‌రామ‌ర్శిస్తున్నారు. అలాగే మీనాక్షి సింగ్ మ‌ర‌ణం ప‌ట్ల సంతాపం ప్ర‌క‌టిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version