కేసీఆర్ నిన్న చెప్పాడు.. ఈరోజు చేసి చూపించాడు !

-

నిన్న అసెంబ్లీలో ప్రకటించారు, ఈరోజు చేసి చూపించారు కేసీఆర్. ప్రైవేట్ హాస్పిటల్స్ లో కరోనా పేషెంట్స్ వద్ద జరుగుతున్న దోపిడీ అరికట్టేందుకు ఒక స్పెషల్ ఐఏఎస్ ల టీమ్ ని నియమిస్తామని నిన్న ప్రకటించారు. అన్నట్టుగానే ఈరోజు ఉదయానికల్లా ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రైవేట్ ఆసుపత్రుల్లో కోవిడ్ పేషేంట్లకు జరుగుతున్న ట్రీట్మెంట్ ను, వారి బిల్లింగ్స్ విషయాల్లో ఈ టాస్క్ ఫోర్స్ పనిచేయనుంది.

telangana government say good news to home isolation patients

ముగ్గురు ఐఏఎస్ లతో ఈ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. ఈ టాస్క్ ఫోర్స్ సభ్యులుగా రాహుల్ బొజ్జ, సర్ఫరాజ్ అహ్మద్, డీ. దివ్యలని నియమించారు. కరోనా ట్రీట్మెంట్ కోసం ప్రభుత్వం నిర్దేశించిన ధరలు అమలవుతున్నాయా లేదా అని ఈ టాస్క్ ఫోర్స్ పర్యవేక్షించనుంది. అలానే పేషేంట్లకు కోవిడ్ ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు ప్రభుత్వం నిర్దేశించిన ప్రోటోకాల్స్ పాటిస్తున్నాయా లేదా అని ఆకస్మిక తనిఖీలు చేయనుంది. ప్రైవేట్ ఆసుపత్రుల తీరును ఎప్పటికప్పుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నివేదించాలని ఉత్తర్వులలో పేర్కొన్నారు. టాస్క్ ఫోర్స్ కు రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంభ సంక్షేమ శాఖ సాంకేతిక సహకారం అందించనుంది.

Read more RELATED
Recommended to you

Latest news