నాకే పాపం తెలియదు: వెంటనే మాట మార్చేసిన రియా

-

సుశాంత్ సింగ్ రాజపుత్ ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితురాలు అని ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తి మాట మార్చింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణానికి సంబంధించిన డ్రగ్స్ కేసుకు సంబంధించి మంగళవారం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) అరెస్టు ఆమెను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఆమెను రిమాండ్ కు తరలించే ముందు బెయిల్ పిటీషన్ దాఖలు చేసారు.

ఆమె బెయిల్ పిటిషన్ను మేజిస్ట్రేట్ కోర్టు మంగళవారం తిరస్కరించింది. తాజాగా మరోసారి ఆమె బెయిల్ పిటీషన్ దాఖలు చేసారు. తాను ఎటువంటి నేరం చేయలేదని అలాగే ఎన్‌సిబి తనను బలవంతంగా ఒప్పించింది అంటూ ఆమె ఆరోపించారు. రియా తరపు న్యాయవాది సతీష్ మనేషిందే దాఖలు చేసిన పిటిషన్ లో… ఆమె ఎటువంటి నేరం చేయలేదని అలాగే ఈ కేసులో కావాలని ఇరికించారని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news