ప్రైవేట్ టీచర్స్ విషయంలో మాట నిలబెట్టుకున్న కేసీఆర్…!

-

కరోనా సమయంలో ప్రైవేట్ టీచర్స్ ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు ఏంటీ అనేది మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపధ్యంలో ప్రైవేట్   టీచర్లకు తెలంగాణా ప్రభుత్వం ఆర్ధిక సహాయం చేసింది. తాజాగా పెండింగ్ లో ఉన్న ప్రైవేట్ టీచర్ లకు 2 వేల ఆర్థిక సహాయం అకౌంట్స్ లో విద్యా శాఖ జమ చేసింది. 84 వేల ప్రైవేట్ టీచర్స్ లో ఎలిజిబుల్ ఉన్న 79 వేల మంది అకౌంట్స్ లో డబ్బులు జమ చేసారు.

ఇప్పటికే (ఏప్రిల్ లో) లక్ష 25 వేల మంది ప్రైవేట్ స్కూల్స్ సిబ్బంది అకౌంట్స్ లో డబ్బులు జమ చేసారు. ఒకటి రెండు రోజుల్లో మే నెల ఆర్థిక సహాయం కూడా వారి బ్యాంక్ అకౌంట్స్ లో జమ చేయనున్నారు. గత నెల బియ్యం అందని వారికి రెండు నెలలు కలిపి 50 కేజీ ల బియ్యం ఇస్తారు. కొత్త వారి జాబితా ను పౌర సరఫరాల శాఖ కు పాఠశాల విద్యాశాఖ పంపింది.

Read more RELATED
Recommended to you

Latest news