జగన్ ఇంటి ముందు ఆత్మహత్య… అసలు మేటర్ ఏంటీ…?

-

ఏపీ సిఎం వైఎస్ జగన్ ఇంటి వద్ద కలకలం రేగింది. సీఎం క్యాంపు కార్యాలయం సమీపంలో భారతమాత విగ్రహం వద్ద ఆత్మహత్య యత్నం జరిగింది. పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యయత్నంకు కృష్ణా జిల్లాకు చెందిన దంపతులు ప్రయత్నం చేసారు. కుటుంబ ఆర్థిక పరిస్థితి సరిగా లేనందున సీఎం క్యాంపు కార్యాలయంకు వచ్చిన నరేష్, సరస్వతీ… సీఎం ను కలవాలని సెక్యురిటి సిబ్బందిని కోరారు.

కోవిడ్ కారణంగా కలవడం కుదరదు అని చెక్ పోస్టు సిబ్బంది చెప్పారు. విజ్ఞాపన పత్రాన్ని ఇస్తే పంపుతాం అని సిబ్బంది చెప్పారు. అంతలో దంపతులు పెట్రోల్ పోసుకునే ప్రయత్నం చేయగా చెక్ పోస్టు సిబ్బంది అడ్డుకున్నారు. మహిళకు ఫిట్స్ ఉండడం తో తాడేపల్లి ప్రైమరీ హెల్త్ సెంటర్ కు పోలీసులు తరలించారు.

Read more RELATED
Recommended to you

Latest news