ప్రభుత్వ వైద్యులకు తెలంగాణ ప్రభుత్వం షాక్.. ప్రైవేట్ ప్రాక్టీస్ చేయొద్దని ఆదేశాలు !

-

ప్రభుత్వ వైద్యులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. ప్రైవేట్ ప్రాక్టీస్ చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది సర్కార్. కొత్తగా ఉద్యోగాల్లో చేరే ప్రభుత్వ వైద్యులు.. ప్రైవేట్ ప్రాక్టీస్ చేసేందుకు వీలు లేదని రాష్ట్ర ప్రభుత్వం.

ఈ మేరకు హెల్త్ సెక్రటరీ రిజ్వి అధికారిక జీవో విడుదల చేశారు. ఇదివరకే ఉద్యోగాల్లో ఉన్న వైద్యులు ప్రాక్టీస్ చేసుకోవచ్చని.. దానిపై ఎలాంటి ఆంక్షలు విధించ లేదని స్పష్టం చేశారు. అయితే కొత్తగా వీధుల్లోకి వచ్చే వారు మాత్రం ప్రైవేట్ ప్రాక్టీస్ చేసుకోవద్దని స్పష్టం చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ నియమ నిబంధనలు పాటించని యెడల.. ఆయా వైద్యులపై… చర్యలు తప్పవని హెచ్చరించింది.

Read more RELATED
Recommended to you

Latest news