కాంగ్రెస్​ పార్టీ ధర్నాకు హైకోర్టు గ్రీన్​ సిగ్నల్​

-

కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ హైకోర్టు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో గ్రామ పంచాయతీ నిధుల గురించి ధర్నాచౌక్​ వద్ద ఆ పార్టీ తలపెట్టనున్న ఆందోళన కార్యక్రమానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడి వేసిన పిటిషన్​పై ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులు వెలువరించింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ధర్నాకు అనుమతి నిరాకరించడాన్ని టీపీసీసీ సవాల్​ చేస్తూ.. హైకోర్టులో పిటిషన్​ దాఖలు చేసింది. దీనిపై లంచ్​ మోషన్​లో విచారణను స్వీకరించిన ధర్మాసనం.. తీర్పును వెలువరించింది.

గ్రామ పంచాయతీలకు నిధులపై తలపెట్టిన ధర్నాకు అనుమతిని మంజూరు చేస్తూ హైకోర్టు గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చింది. ధర్నాచౌక్​ వద్ద ధర్నాకు సంబంధించిన కొత్త తేదీలతో దరఖాస్తు చేసుకోవాలని టీపీసీసీకి తెలిపింది. ఈ ధర్నాలో పాల్గొనే వారు 300 మందికి మించి ఉండరాదని హైకోర్టు స్పష్టం చేసింది.

ఈనెల 2వ తేదీన గ్రామ పంచాయతీ నిధుల దారి మళ్లింపుపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి ధర్నాచౌక్​ వద్ద ధర్నాలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ ధర్నా పిలుపుతో అప్రమత్తమైన పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్​ పార్టీ ముఖ్యనేతలను ముందస్తుగా గృహనిర్బంధం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news