తెలంగాణ ఆర్టీసీ మరో సంచలన నిర్ణయం..రక్తదానం చేసిన వారికి ఉచితంగా ప్రయాణం !

-

తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఎండీ గా సజ్జనార్‌, ఆర్టీసీ చైర్మన్‌ గా ఎమ్మెల్యే బాజిరెడ్డి… బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి… తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ లో సమూల మార్పులు చోటు చేసు కుంటున్నాయి. ఇప్పటికే చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ.. ఆర్టీసీని లాభాల బాట పట్టిస్తున్నారు అధికారులు. ముఖ్యంగా ఆర్టీసీ లో ప్రయాణించిన వారికి ప్రత్యేక.. ఆఫర్లు పెడుతూ… ముందుకు సాగుతోంది తెలంగాణ ఆర్టీసీ.

ఇక తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది తెలంగాణ ఆర్టీసీ. రక్త దానాన్ని ప్రోత్సహించేందుకు ముందుకు వచ్చింది ఆర్టీసీ. రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్ డిపోల్లో రక్తదాన శిబిరాలు నిర్వహించనుంది యాజమాన్యం. అయితే… ఈ సందర్భంగా రక్త దానం చేసిన వారికి రేపు తిరుగు ప్రయాణంలో ఉచిత బస్సు సదుపాయం కల్పించాలని నిర్ణయం తీసుకుంది తెలంగాణ ఆర్టీసీ. వారికి కావాల్సిన ప్రూట్స్‌ కూడా ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. కాగా… ఆర్టీసీ తరఫున వచ్చే జీతాన్ని తనకు వద్దని చైర్మన్‌ బాజిరెడ్డి ఇటీవల ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news