కంటతడి పెట్టిన తెలంగాణ స్పీకర్..!

-

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి నిజామాబాద్‌ జిల్లాలోని కోటగిరి మండలం హంగర్గ గ్రామంలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాటాడుతూ..బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను చాలా కృషి చేస్తున్నానని, అయితే, కొందరు మాత్రం తనపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని చెబుతూ కన్నీరు పెట్టుకున్నారు. బాన్సువాడకు 5,000 ఇళ్లు మంజూరయ్యాయని ఆయన వివరించారు. అవి పూర్తి చేసేందుకు నిధులు సరిపోకపోవడంతో ఎన్నో కష్టాలు పడి నిర్మాణ పనులను పూర్తి చేయిస్తున్నాని తెలిపారు. తాను ఇంతగా కష్టపడుతుంటే కొందరు మాత్రం తనపై పలు ఆరోపణలు చేస్తున్నాని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version