కేసీఆర్ సర్కార్ కీలక నిర్ణయం..విద్యుత్ ఉద్యోగులకు 3.724% డీఏ మంజూరు

-

కేసీఆర్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యుత్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారికి 3.724% డిఏ మంజూరు చేస్తూ ట్రాన్స్ కో సీఎండీ ప్రభాకర్ ఉత్తర్వులు ఇచ్చారు.

జూలై 1 నుంచి 28.638 శాతం డిఏ చెల్లిస్తుండగా, ఈ ఏడాది జనవరి నుంచి 32.362 శాతం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. జనవరి, ఫిబ్రవరి నెలకు సంబంధించి పెరిగిన డిఏ బకాయిలను మార్చి నెల జీతంతో కలిపి ఏప్రిల్ నెలలో చెల్లించనున్నట్లు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news