కొమురవెల్లి మల్లన్న సన్నిధిలో భక్తులకు తిప్పలు తప్పడం లేదు. కొమురవెల్లి మల్లన్న ఆలయంలో కనీస సౌకర్యాలు కరువు అయ్యాయని ఆందోళన చెందుతున్నారు భక్తులు. తాగునీరు, మరుగుదొడ్లు వంటి కనీస సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలం అయ్యారని భక్తులు చెబుతున్నారు. తాగునీరు సౌకర్యం లేక వాటర్ బాటిల్స్ కొనుక్కుంటున్నామని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నిత్యం వేల సంఖ్యలో తరలి వస్తున్నారు భక్తులు. ఆలయానికి రూ.కోట్ల ఆదాయం వస్తున్నప్పటికీ భక్తులకు కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో అధికారులు విఫలం అవుతున్నారు. తాగునీరు సౌకర్యం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు భక్తులు.