తెలంగాణలో పలువురు ఐఏఎస్‌ల బదిలీలు

-

  • తెలంగాణ ప్రభుత్వం ఈరోజు పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు సతీమణి ఐఏఎస్ అధికారిని శైలజ రామఅయ్యర్ కు వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించింది.ప్రస్తుతం ఆమె యువజన సర్వీసులు, పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నది. యువ ఐఏఎస్ అధికారిని ఆమ్రపాలికి హెచ్ఎండిఏ(హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ కమిషనర్) కమిషనర్ గా ప్రభుత్వం బాధ్యతలు ఇచ్చింది . దీనితో పాటు మూసి రివర్ డెవలప్మెంట్ బోర్డ్ ఎండిగా బాధ్యతలు స్వీకరించబోతుంది.

ఇంధన శాఖ కార్యదర్శిగా, ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీగా రిజ్విని నియమిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.ముషారఫ్ అలీ ఫరూకీ – TSSPDCL సీఎండీగా ,TSNPDCL గా సీఎండీగా కర్నాటి వరుణ్ రెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.ట్రాన్స్ కో జేఎండీగా సందీప్ కుమార్ ఝాను నియమించారు.ఇక, అగ్రికల్చర్ డైరెక్టర్‌గా బి. గోపి.. ని ,భట్టి విక్రమార్క ఓఎస్‌డీతో పాటు ఆర్థిక శాఖ జాయింట్ సెక్రటరీగా ఐఏఎస్ కృష్ణ భాస్కర్‌ను నియమిస్తున్నట్లు ఈరోజు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

 

Read more RELATED
Recommended to you

Latest news