పవన్ కళ్యాణ్ కు బిగ్ షాకిచ్చిన టీ బిజేపి……

-

వచ్చే ఏడాది జరగబోయే పార్లమెంట్ ఎన్నికల గురించి కేంద్ర శాఖామంత్రి బిజెపి చీఫ్ కిషన్ రెడ్డి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ…. వచ్చే ఎన్నికల్లో మేము ఏ పార్టీతో పొత్తులు పెట్టుకోవడం లేదని స్పష్టం చేశారు. తెలంగాణలో బిజెపి ఒంటరిగానే పోటీ చేస్తుందని తెలిపాడు. సర్వేలకు అందని తీరుగా ఈసారి లోక్సభ ఎన్నికల ఫలితాలు ఉండబోతున్నాయని అన్నాడు.

ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి జనసేన పార్టీతో పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ భాగంగా జనసేన పార్టీకి 8 సీట్లు కేటాయించింది కానీ జనసేన పార్టీ ఒక్క సీటు కూడా గెలువకపోగా కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు. సినిమాల్లో పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ ఎన్నికల్లో పనికి వస్తుందని అనుకున్న వ్యూహం బిజెపి పార్టీకి బెడిసికొట్టింది. దీంతో బిజెపి వచ్చే ఎన్నికల కి పక్కా ప్రణాళిక రచిస్తుంది. బిజెపి కీలక నేతలైన బండి సంజయ్ ఈటల రాజేందర్ ధర్మపురి అరవింద్ మరియు రఘునందన రావు లు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version