తెలంగాణ సర్కార్ శుభవార్త…నేడు అకౌంట్లలోకి రూ.10,000

-

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఇవాళ వరద బాధితుల అకౌంట్లో డబ్బులు వేయనుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఖమ్మం వరద బాధితులకు తక్షణ సహాయంగా ఇవాల్టి నుంచి వారి ఖాతాలలో… ఏకంగా 10,000 జమ చేయనుంది రేవంత్ రెడ్డి సర్కార్.

ఈ విషయాన్ని స్వయంగా తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి, ఖమ్మం నియోజకవర్గం ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించడం జరిగింది. వరద బాధితులను అన్ని విధాల ఆదుకుంటామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి… ఇప్పటికే హామీ ఇచ్చారు. ఎవరికి కష్టం రాకుండా చూసుకుంటాం అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు… వరదల్లో మృతిచెందిన కుటుంబాలకు 5 లక్షల రూపాయలు ఇవ్వనున్నారు. పాడి పశువులు చనిపోతే… 50వేల రూపాయలు ఇవ్వబోతున్నారు. ఇక మేకలు అలాగే గొర్రెలు చనిపోతే ఒక్కోడానికి 5000 రూపాయలు చొప్పున ఇవ్వనుంది రేవంత్ రెడ్డి సర్కార్.

Read more RELATED
Recommended to you

Latest news