రేపటి నుంచే టెన్త్ సప్లమెంటరీ పరీక్షలు

-

తెలంగాణలో పదవ తరగతి అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలు రేపటి నుంచి (ఆగస్టు 1) ప్రారంభం కానున్నాయి. 2021 – 22 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఫెయిల్ అయిన స్టూడెంట్స్ కు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇప్పటికే హాల్ టికెట్స్ కూడా విడుదల చేశారు. ఆగస్టు 1 వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఈ అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల సహాయ సంచారకుడు రామేశ్వర రావు తెలిపారు.

ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. విద్యార్థులు గంట ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. పరీక్షా కేంద్రాలలో ఏదైనా సమస్య వస్తే వెంటనే 9989074453 గల నెంబర్ కు సంప్రదించాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news