డెక్కన్ స్పోర్ట్స్ భవనంలో 2 మృతదేహాలు గుర్తింపు

-

సికింద్రాబాద్ రాంగోపాల్ పేట లోని దక్కన్ మాల్ లో గురువారం భారీ అగ్నిప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో అగ్నిమాపక సిబ్బంది నలుగురు కార్మికులను రక్షించగా.. మరో ముగ్గురు భవనం లోపల చిక్కుకున్నట్లు గుర్తించారు. ఆ ముగ్గురి కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగించగా బిల్డింగ్లో పూర్తిగా కాలిపోయిన రెండు మృతదేహాలను అధికారులు గుర్తించారు. డ్రోన్ సాయంతో భవనం లోపల అధికారులు పరిశీలించగా రెండు మృతదేహాలు కనిపించాయి.

ప్రమాదం సమయంలో స్పోర్ట్స్ మాల్ లో వసీం, జునైద్, జహీర్ చిక్కుకున్నట్లు మాల సిబ్బంది అధికారులకు తెలిపారు. వీరిని రక్షించేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇక ప్రమాదానికి గురైన డెక్కన్ స్పోర్ట్స్ భవనాన్ని కూల్చివేస్తామని మున్సిపల్ అధికారులు తెలిపారు. భవనం వెనక భాగం పూర్తిగా దెబ్బతిందని చెప్పారు. బిల్డింగ్ నిలబడలేని స్థితిలో ఉందన్నారు. దీంతో కూల్చివేతకు ఏర్పాట్లు చేస్తున్నట్లు డిసి రాజేష్ చంద్ర తెలిపారు. చుట్టుపక్కల వారికి ప్రమాదం లేకుండా భవనాన్ని కూలుస్తామని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news