తెలంగాణ‌లో నేడు 2,387 క‌రోనా కేసులు, ఒక‌రు మృతి

-

తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా వైర‌స్ వ్యాప్తి నెమ్మ‌దిగా త‌గ్గుముఖం ప‌డుతుంది. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు క‌రోనా బులిటెన్ ను విడుద‌ల చేశారు. ఈ బులిటెన్ ప్ర‌కారం గ‌డిచిన 24 గంట‌ల‌లో రాష్ట్ర వ్యాప్తంగా 79,561 క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్షల‌ను అధికారులు నిర్వ‌హించారు. ఈ ప‌రీక్షల‌లో 2,387 క‌రోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో 7,74,215 క‌రోనా కేసులు న‌మోదు అయ్యాయి.

అలాగే రాష్ట్రంలో నేడు క‌రోనా మ‌హ‌మ్మారి వ‌ల్ల ఒక‌రు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో 4,097 క‌రోనా మ‌ర‌ణాలు వెలుగు చూశాయి. అలాగే గ‌డిచిన 24 గంట‌ల‌లో రాష్ట్ర వ్యాప్తంగా 4,559 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ప్ర‌స్తుతం 30,931 క‌రోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. అయితే రాష్ట్రంలో క‌రోనా వ్యాప్తి త‌గ్గ‌డంతో రాష్ట్ర ప్ర‌భుత్వం ఆంక్షల‌ను స‌డ‌లించింది. దీంతో ప్ర‌జ‌లు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. క‌రోనా వ్యాప్తి త‌గ్గినా.. ప్ర‌మాదం మాత్రం త‌గ్గ‌లేద‌ని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news