దేశంలో ఇంకా 40వేల గుళ్లు కట్టాలి.. రాజాసింగ్ సింగ్ సెన్షేషన్ కామెంట్స్

-

బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ వికారాబాద్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. బాబ్రీ మసీదు కోసం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నానా యాగీ చేస్తున్నారు, పార్లమెంట్లో బాబ్రీ మసీద్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇప్పుడే అయిపోలేదని.. భవిష్యత్లో ఒవైసీ ఇంకా చాలా చూడాల్సి ఉందని అన్నారు.

మేమేంటో ముందు ముందు ఇంకా చూపిస్తామని కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్తర ప్రదేశ్లో అయోధ్య రామమందిరం కట్టి చూపించాం.. కాశీ, మధురలో కూడా గుళ్లు కడతామని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో ఇంకా 40 వేల గుళ్లు కట్టాల్సి ఉందని రాజా సింగ్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. గతంలో చేతకాని వాళ్లు దేశాన్ని పాలించారని, ఇప్పుడు భారత్లో భగవరాజ్యం నడుస్తోందని అన్నారు. దేశంలో ఇప్పుడు మనల్ని ఎవరూ ఆపలేరని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news