వారి మాటలు నమ్మకండి.. మంత్రి కోమటిరెడ్డి రిక్వెస్ట్

-

నల్లగొండ జిల్లా కేంద్రంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విస్తృతంగా పర్యటించారు. ఆదివారం ఉదయం బైక్ రైడింగ్ చేస్తూ పలు కాలనీలను సందర్శించారు. ముందుగా ఐదేళ్ల చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఆ తర్వాత గృహజ్యోతి లబ్దిదారులతో మాట్లాడి జీరో బిల్ ఇచ్చారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చి 100 రోజులు కూడా కాకముందే 4 గ్యారంటీలు అమలు చేశామని అన్నారు.

హామీలను తాము 90 రోజులలోపే అమలు చేస్తున్నామని అన్నారు. అలాగే ఈ నెల 11 నుంచి  ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించబోతున్నామని తెలిపారు. ఒక ఇంటికి ప్రభుత్వం నుంచి రూ.5 లక్షలు ఖర్చు పెట్టి స్థలం ఉన్నా లేకపోయిన నిరుపేదలకు ఇళ్లు కట్టిస్తామని పేర్కొన్నారు. దాదాపు పదేళ్ల తరువాత నిరుపేదల కళ్లలో ఆనందాన్ని చూస్తున్నామని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల తరువాత రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్ కనుమరుగు అవ్వడం ఖాయమని అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 14 స్థానాల్లో విజయకేతనం ఎగురవేయబోతోందని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news