వనస్థలిపురంలో షాకింగ్ ఘటన.. ర్యాష్ డ్రైవింగ్ తో యువతిని ఢీ కొట్టిన కారు..!

-

ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాలు విఫరీతంగా జరుగుతున్నాయి. చాలా వరకు రోడ్డు యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. చాలా మంది అమాయకులు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. కొంత మంది రోడ్డు వెంబడి నడుచుకుంటూ వెళ్లాలంటే కూడా జంకుతున్నారు. వాహనదారులు కొందరూ సరిగ్గానే వెళ్తున్నప్పటికీ పక్కవారి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి.

తాజాగా హైదరాబాద్ నగరంలోని వనస్థలిపురంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. సీసీ పుటేజీ పరిశీలిస్తే.. ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. వనస్థలిపురంలో ర్యాష్ డ్రైవింగ్ చేసి ఓ యువతిని ఢీ కొట్టింది కారు.  వనస్థలిపురం NGOs కాలనీ వివేకానంద పార్క్ ముందు రాష్ డ్రైవింగ్ చేస్తూ ఓ యువతిని బలంగా ఢీ కొట్టడంతో ఎగిరి రోడ్డు అవతల పడింది. దీంతో హయత్ నగర్ కి చెందిన సోనీ(21) అనే యువతికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది.  ఆ వాహనాన్ని నడిపిన వ్యక్తిని పట్టుకున్నారు స్థానికులు. ఆ తరువాత పోలీసులకు అప్పగించారు. మీ లాంటి వ్యక్తుల వల్ల అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని దేహశుద్ది కూడా చేశారు స్థానికులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version