డబల్ బెడ్ రూం రాలేదని.. ప్రగతి భవన్ ఎదుట దంపతుల ఆత్మహత్యాయత్నం..!

-

డబుల్ బెడ్ రూమ్ ఇల్లు రాలేదని మనస్థాపం చెందిన దంపతులు ప్రగతిభవన్ ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ కు చెందిన మహేందర్ (40) తన కుటుంబంతో కలిసి హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారు. కొంతకాలం క్రితం డబుల్ బెడ్ రూమ్ ఇంటి కోసం దరఖాస్తు చేసుకోగా, మంజూరైనట్లు ఇటీవల అధికారుల నుంచి ఫోన్ వచ్చింది.

ఆ తర్వాత మహేందర్ ఏ అధికారి వద్దకు వెళ్లినా ఇంటి విషయంపై సరైన సమాధానం చెప్పలేదు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన మహేందర్ తన భార్యతో కలిసి ప్రగతిభవన్ వద్ద కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. అది గమనించిన భద్రత సిబ్బంది వారిని రక్షించారు. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పంజాగుట్ట ఇన్ స్పెక్టర్ దుర్గారావు మాత్రం  రెండు రోజుల కిందట ఈ ఘటన జరిగింది చెప్పారు. ఈ విషయంపై విచారణ చేసినట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news